- Advertisement -
భారత సీనియర్ క్రికెటర్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాకు అర్డున అవార్డు దక్కింది.ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచకప్ సెమీస్లో జడేజా అద్భుతంగా పోరాడిన సంగతి తెలిసిందే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ధోనీతో కలిసి ఆదుకున్నాడు.
భారత్ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42టీ20లు ఆడాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. రెజ్లర్ బజ్రంగ్ పునియా ఖేల్రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.