తాజా ఐపీఎల్ సీజన్లో కోల్కతా ఆటగాడు ఆండ్రూ రసెల్ మిగిలిన జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. భీకరమైన ఫామ్లో ఉన్న రస్సెల్కు బౌలింగ్ చేయలంటే బౌలర్లు భయపడిపడుతున్నారు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు 10 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా కోహ్లీ భయపడ్డాడు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకుండి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు జట్టు కోల్కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి (100) సెంచరీతో చేలరేగగా , మొయిన్ అలీ ( 66) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడింది. నితీశ్ రాణా ( 85 నాటౌట్;), రసెల్ (65) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. రసెల్ ఆడుతున్నంతసేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠ నెలకొంది.
కాని 19 ఓవర్ మొదటి మూడు బంతులకు రసెల్ ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో కోల్కతా ఓటమి ఖాయం అయిపోయింది. సెంచరీ చేసిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ ఓటమితో వరుసగా నాలుగు పరాజయాలు తమ ఖాతాలో వేసుకుంది కోల్కతా నైట్రైడర్స్ జట్టు.
- Advertisement -
కోహ్లీ సేనను వణికించిన రసెల్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -