Thursday, April 25, 2024
- Advertisement -

నాలుగో టెస్ట్‌కు దూరం కానున్న రోహిత్ శ‌ర్మ‌…

- Advertisement -

టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ నాలుగో టెస్టుకు దూరం కానున్నారు. రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి పాపకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ఆసుప్రతిలో రితికా, రోహిత్ లకు ఆడబిడ్డ జన్మించిందని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువైన సీమా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న రోహిత్‌ శర్మ తన బుజ్జి పాపాయిని, భార్యను చూసేందుకు భారత్‌కు తిరుగుపయనమయ్యారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అతని రాకతో భారత్ జట్టులో సమతూకం వచ్చింది. సిడ్నీ టెస్టులోనూ అతను ఆడితే మ‌రింత బ‌లం చేకూర్చేది. 2015 డిసెంబరు 13న రోహిత్‌ తన స్నేహితురాలు, మేనేజర్‌ రితికాను వివాహం చేసుకున్నారు.తాజాగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో రితికా పాపకు జన్మనిచ్చారు

ప్రస్తుతం అతడు భారత్‌కు బయల్దేరాడని, నాలుగో టెస్టుకు ఆడట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా జ‌ట్టులోకి రానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -