Saturday, April 20, 2024
- Advertisement -

గ్రౌండ్ లో కాదు గల్లీలో స్టార్ హీరోలతో క్రికెట్ ఆడిన సచిన్….

- Advertisement -

టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ జాతీయ క్రీడా దినోత్సవం నాడు గల్లీలో క్రికెట్ ఆడి సందడి చేశారు. స్పోర్ట్స్‌ ప్లేయింగ్‌ నేషన్‌, ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా సచిన్‌ బాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు.తనతో పాటు క్రికెట్‌ ఆడతారా అని బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్‌ వారితో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు.

తొలత వరుణ్ బౌలింగ్‌ చేయగా…. తర్వాత జూనియర్‌ బచ్చన్‌ కూడా బౌలింగ్‌ చేశారు. తర్వాత జీయా అనే అమ్మాయి బౌలింగ్‌ చేయగా..వరుణ్‌ కూడా బ్యాటింగ్‌ చేశారు.ఈ సందర్భంగా సచిన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.గల్లీలో క్రికెట్‌ ఆడటం ఆనందం ఉందని సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. సచిన్ ట్విట్ పై వరుణ్ స్పందించారు.స్పోర్ట్స్‌ ప్లేయింగ్‌ నేషన్‌ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -