ప్రంపచకప్ ఫైనల్లో దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడింది. అయితే ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడంపైనా ఐసీసీఐ అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పోరాటం అందర్నీ అకట్టుకుంది. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ముగిశాక బహుమతి ప్రదానోత్సవంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందజేస్తూ సచిన్ టెండూల్కర్ అనునయంగా ఏదో చెబుతూ కనిపించాడు. అయితే తాను ఏం చెప్పానో తాజాగా సచిన్ వెల్లడించారు.
నెమ్మదిగా ఉండటమే విలియమ్సన్కు ఆభరణమని పేర్కొన్నాడు. విలియమ్సన్కు అవార్డు ప్రదానం చేసే సమయంలోనూ తనకిదే మాట చెప్పానని తెలిపాడు. తాను విలియమ్సన్ లో గమనించింది అతడి శాంత స్వభావమేనని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రశాంతతను వీడడని సచిన్ కొనియాడాడు. అనూహ్యరీతిలో ప్రపంచకప్ టైటిల్ దూరమైనా ముఖంలో ఆ వేదన కనిపించనీయకుండా సంయమనంతో వ్యవహరించాడని కితాబిచ్చాడు.