- Advertisement -
మాంచెస్టర్లో జరిగి మ్యాచ్లో పాక్పై భారత్ ఘనవిజయం సాధించడంతో ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పాక్ టీమ్ను కామెంట్లతో చెడుగుడు అడుకుంటున్నారు. తాజాగా గ్రౌండ్లోనె పాక్ కెప్టెన్ సర్పరాజ్ను అభిమానులు ఘోరంగా అవమానించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో కోచ్ మిక్కి ఆర్థర్తో సర్ఫరాజ్ నిలబడగా.. అతన్ని ఉద్దేశించి గ్యాలరీలో ఉన్న అభిమానులు చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. ‘ సర్ఫరాజ్ నీకు చాలా కొవ్వెక్కింది. బ్యాటింగ్ పిచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటావా? మన దేశ ప్రధాని మాట వినవా? అంటూ అరవసాగారు. ఈ మాటలు విని వారివైపు చూసిన సర్ఫరాజ్.. స్వయంకృత అపరాధంగా భావించి నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.