Wednesday, April 17, 2024
- Advertisement -

భార‌త్‌, పాక్ మ్యాచ్‌పై ఫ‌న్నీ ట్వీట్ చేసిన పాక్ మాజీ బౌల‌ర్ అక్త‌ర్‌….

- Advertisement -

ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ అనుకున్న స్థాయిలో అభిమానుల‌ను అల‌రించ‌డంలేదు. దీంతో ఐసీసీపై క్రికెట్ ప్రేమికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీని కంత‌టికి కార‌ణం వ‌రుణుడే. వ‌ర్షం వల్ల ఇప్ప‌టికె నాలుగు మ్యాచ్‌లు ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. ఇద‌లా ఉంటె రేపు ఆదివారం జ‌రిగే పాక్‌, భార‌త్ మ్యాచ్‌కు వ‌ర‌నుడి ముప్పు పొంది ఉంద‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌ధ్యంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ అక్త‌ర్ ర్ ఇరు జ‌ట్ల‌మీద ఫ‌న్నీ ట్వీట్ చేశారు.

మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో పాక్‌, భార‌త్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈమ్యాచ్ అంటే అంద‌రికి హై ఓల్టేజ్ లాంటిది. అలాంటి ర‌స‌వ‌త్త‌ర‌మైన ఆట‌ను ఈ సారి అభిమానులు మిస్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఈ ఆదివారం కూడా మాంచెస్ట‌ర్‌లో భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. ఇండోపాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కూడా వ‌ర్షార్ప‌ణం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై అక్త‌ర్ స్పందించాడు. దాయాదీ పోరులో వర్షం విజయం సాధించేలా ఉందని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సందేహం వ్యక్తం చేశాడు. అంతే కాదు ట్విట్ట‌ర్‌లో ఒ ఫ‌న్నీ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

టాస్ కోసం పిచ్ వ‌ద్ద‌కు వెళ్లిన ఇరు జ‌ట్ల కెప్టెన్లు కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌లు.. టాస్ ముగిసిన త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు ఈత కొట్టుకుంటూ వ‌చ్చే ఓ సెటైర్ ట్వీట్‌ను పోస్టు చేశాడు. ఇక మైదానంలో టాస్‌పై విశ్లేష‌ణ చేస్తున్న క్రికెట్ పండితులు.. ఓ బోట్‌లో నిల‌బ‌డి మాట్లాడుతున్న‌ట్లుగా ఫోటోను డిజైన్ చేశారు. నీటితో నిండిన స్టేడియంలో ఓ షార్క్ కూడా ఉంది. ఆదివారం ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌ని అక్త‌ర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -