Friday, April 19, 2024
- Advertisement -

సుశాంత్ మృతిపై ధోనీ స్పందించకపోవడానికి కారణం ఏంటి ?

- Advertisement -

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందర్ని ఏడిపించింది. అతనికి సంతాపం తెలుపుతూ సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్ చేయగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. నిజానికి ధోనీ బయోపిక్ ద్వారానే సుశాంత్ స్టార్ హోదాని సంపాధించుకున్నాడు. 2016లో వచ్చిన ధోనీ బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో ధోనీగా సుశాంత్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం సుశాంత్ చాలా రోజులు ధోనీతో కలిసి ట్రావెల్ చేశాడు.

ఆ క్రమంలో ధోనీ మేనరిజాన్ని ఒడిసిపట్టుకున్న సుశాంత్.. అతని ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత సుశాంత్ అంకితభావానికి ధోనీ ఫిదా అయినట్లు నిర్మాత అరుణ్ పాండే తాజాగా వెల్లడించాడు. ధోనీ, సుశాంత్ మధ్య క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండటంతో.. ఆత్మహత్య పై ధోనీ ఎలా స్పందిస్తాడో ? అని అందరిలో ఆసక్తిగా మారింది. కానీ ధోనీ స్పందించలేదు. అయితే ధోనీ స్పందనపై చర్చ జరగడంతో అతని మేనేజర్, ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ నిర్మాత అరుణ్ పాండే స్పందించాడు.

‘‘సుశాంత్ సూసైడ్‌ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. నా బాధ వర్ణణాతీతం. ఆ ఆత్మహత్య గురించి వినగానే ధోనీకి ఫస్ట్ చాలా కోపం వచ్చింది’’ అని అరుణ్ పాండే వెల్లడించాడు. నిజానికి ధోనీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు. ధోనీ గురించి సమాచారం, రూమర్స్‌ని ఖండించే బాధ్యతని అతని భార్య సాక్షి గత కొంతకాలంగా చూస్తోంది. అందుకే సుశాంత్ సూసైడ్ పై ధోనీ ట్వీట్ చేయాలేదని తెలుస్తోంది. మొత్తంగా సుశాంత్‌ సూసైడ్ చేసుకోవడం ధోనీకి నచ్చలేదని అందుకే స్పందించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ధోనీ క్రికెట్‌లో ఓ పెద్ద సూపర్ స్టార్ : డ్వేన్ బ్రావో

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -