Saturday, April 20, 2024
- Advertisement -

తొలి వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న 5 వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్ జ‌ట్టు శుభారంభం చేసింది. నేపియర్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో భార‌త్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి కివీస్ జ‌ట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. భార‌త బౌలర్లు కుల్దీప్‌ (4/39), షమీ(3/19), చహల్‌( 2/43), కేదార్‌ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే కివీస్ జట్టు ఆలౌటైంది. ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కుషాక్ ఇచ్చారు కివీస్ బౌల‌ర్లు.

ఆదిలోనే ఓపెనర్ రోహిత్‌ శర్మ వికెట్ కొల్పోయింది భార‌త జ‌ట్టు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లితో ధావన్‌ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో కెరీర్‌లో 26వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ‌రోవైపు అర్థ సెంచ‌రీకి దగ్గ‌ర‌గా వ‌చ్చి ఔట్ అయ్యాడు కోహ్లీ. తర్వాత క్రీజులోకి వచ్చిన హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడితో ధావన్‌ మిగతా పనిని పూర్తి చేశాడు. కుల్దీప్ యాద‌వ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. 5 వ‌న్డేల సిరీస్‌లో భార‌త జ‌ట్టు 1-0 అధిక్యంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -