Friday, April 19, 2024
- Advertisement -

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ…

- Advertisement -

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌తోపాటు ఐర్లాండ్ టీ20 సిరీస్, ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియాను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు మళ్లీ టీమిండియాలోకి వచ్చేశాడు.

త్వరలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టుని మంగళవారం ఎంపిక చేసిన భారత సెలక్టర్లు అంబటి రాయుడితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ కౌల్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి కూడా అవకాశం కల్పించారు.

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు ఆడనున్న భారత్ జట్టు.. అనంతరం జూన్ 27 నుంచి 29 వరకు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జులై 3 నుంచి సెప్టెంబరు 11 వరకు మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మినహా.. మిగిలిన సిరీస్‌లకి సంబంధించిన జట్టుని సెలక్టర్లు తాజాగా ప్రకటించారు.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో తలపడే భారత జట్టు

అజింక్య రహానె (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్ (రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ పర్యటన సన్నద్ధతలో భాగంగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు అక్కడికి వెళ్తుండటంతో ఈ టెస్టుకి దూరమయ్యాడు)

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌‌లో తలపడే భారత జట్టు

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

 

ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌కి భారత్ జట్టు

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్; కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కి భారత జట్టు

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -