- Advertisement -
ఇంగ్లండ్ టూర్లో టెస్ట్సిరీస్లో విఫలం అయిన ధావన్ టెస్టుల్లో ఇక దారులు మూసుకుపోయినట్టే కనిపిస్తున్నాయి.ఈ ఏడాది భారత్ జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లు ఆడాల్సి ఉండగా.. శిఖర్ ధావన్కి మళ్లీ టెస్టుల్లో ఛాన్స్ దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్లో మొత్తం నాలుగు టెస్టులు ఆడిన ధావన్ 26, 13, 35, 44, 23, 17, 3, 1 పరుగులతో నిరాశపరిచాడు. శిఖర్ ధావన్తో పాటు విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్పై చివరి రెండు టెస్టుల్లోనూ వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో యువ ఓపెనర్ పృధ్వీ షాకి అవకాశం కల్పించారు. కాని బెంచ్కే పరిమితం చేశారు.
మరోవైపు చివరి టెస్టులో శతకం బాదిన కేఎల్ రాహుల్ ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. అతనికి జోడీగా.. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పృధ్వీ షా బరిలోకి దిగొచ్చు.