కొత్త సంవత్సరంలో భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ తన రికార్డులను కొనసాగించనున్నాడు. ఇంకో పరుగు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు బద్దలు కొడుతాడు. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
రోహిత్ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధిస్తే విరాట్ 75 మ్యాచుల్లోనే సాధించాడు. అయితే హిట్మ్యాన్కు రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టీ20 సిరీస్కు విశ్రాంతి ఇవ్వడంతో.. రోహిత్ను కోహ్లీ అధిగమించడం దాదాపు ఖయమే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గువాహటిలో శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమికి కూడా విశ్రాంతినిచ్చారు.
భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్కు గాయమవ్వడంతో నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. అయితే రేపటి మ్యాచ్ అందరి దృష్టి టీమిండియా పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రాపై ఉంది. గాయంతో జట్టుకు దూరమైన అతడు దాదాపు నాలుగు నెలల తర్వాత నీలిరంగు జెర్సీ ధరించనున్నాడు.