Thursday, April 25, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ ఇలా ఎందుకు ప్రవర్తించాడు ?

- Advertisement -

విరాట్ కోహ్లీ.. ఇతని పేరుపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. స్టార్ ప్లేయర్ గా భారత కెఫ్టెన్ గా తన బాధ్యతలని నిర్వరిస్తూ జట్టును ఆగ్రస్థానంలో తీసుకుపోతున్నాడు. అయితే ఏ ఆటగాడికైన కొన్ని సమయాలలో అదృష్టం కలిసిరాదు. అన్ని సమయాల్లో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపించడం కుదరదు. ప్రస్తుతం కోహ్లీ అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కివీస్ పర్యటనలో భారత్ t20 మూడు వన్డే రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడింది.

t20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి భారత్.. వన్డే టెస్ట్ సిరీస్ లో రాణించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం బ్యాటమెన్స్ ఘోరంగా విఫలం కావడమే. అలానే కొందరు స్టార్ బ్యాటమెన్స్ గాయాలతో టీంకి దూరం కావడం కూడా మైనస్ అయింది. ఏది ఏమైనా టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన వరుసగా రెండు పరాజయాలను చవి చూడడం అభిమానులకే కాదు సీనియర్ ఆటగాళ్లకు కూడా అంతగా రుచించలేదు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భం గా .. జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం స్లిప్స్లో క్యాచ్ అందుకున్న కోహ్లీ.. న్యూజిలాండ్ ప్లేయర్లను ఉద్దేశించి ‘కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు లెక్కలు సరి చేస్తామని’ ఘాటుగా ఘాటుగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ‘జబ్ ఇండియా మే యే లోగ్ అయేంగే తబ్ ధికా దుంగా’ అంటూ కోపం అన్నాడట. అలాగే విలియమ్సన్ ఔటైనప్పుడు సెండాఫ్ ఇచ్చే క్రమంలో కోహ్లీ అతిగా ప్రవర్తించాడు. నోరు మూసుకోవాలనే అర్థం వచ్చేలా సైగలు చేస్తూ.. బూతుపురాణం అందుకున్నాడు.

ఆ వెంటనే ప్రేక్షకులను కూడా తిట్టాడు. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ మీడియా సమావేశం లో ప్రస్తావించగా ఆ జర్నలిస్ట్ పై కోహ్లీ ఫైర్ అయ్యాడు. సగం సగం తెలుసుకొని ప్రశ్నలు అడగవద్దని పూర్తి సమాచారంతో రావాలని సూచించాడు. మ్యాచ్ ముగిసినా.. భారత్ 0-2తో చిత్తుగా ఓడినా.. ఇవేవి పట్టించుకోని ఫ్యాన్స్ కోహ్లీ వ్యవహారి శైలినే తప్పబడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -