మూడు టీ20ల సిరిస్లో ఈ రోజు మూడో టీ20 మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియం జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20ని భారత్ విజయం సాధించగా.. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించింది.
ఇక మూడో మ్యాచ్ లో అంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఆఖరి టీ20లో విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే టీ20ల్లో సొంతగడ్డపై వెయ్యి పరుగులు మైలురాయిని విరాట్ కోహ్లీ అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టిస్తాడు. సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్లు ఆడి 994 పరుగులు సాధించాడు.
మరో ఆరు పరుగులు సాధిస్తే అరుదైన ఘనత తన ఖాతలో వేసుకుంటాడు. ఇక తమ కెరీర్ లో 1000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు కీరన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్లకు ఈ మ్యాచ్ ఓ గొప్ప అవకాశం. ఈ మ్యాచ్లో పొలార్డ్ మరో 10 పరుగులు, సిమ్మన్స్ మరో 17 పరుగులు అవసరం కానున్నాయి. ముంబైలో వీరిద్దరూ ఈ మైలురాయిని అందుకునే ఛాన్స్ ఉంది.