Thursday, April 18, 2024
- Advertisement -

విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ..!

- Advertisement -

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ ఓటమిని చూసి సిరీస్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన భారత్ కెఫ్టెన్ విరాట్ కోహ్లీ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్ ప్లేయర్లు ఔటైనప్పుడు గ్రౌండ్‌లో మీరు ప్రవర్తించిన తీరుపై మీ స్పందనేంటని.. మైదనం లో ఎలా ఉండాలో మీకు తెలియదా ? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీంతో కోహ్లీ నేనూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ? అని వాదించాడు. నేను కూడా మిమ్మల్నే జవాబు అడుగుతున్నానంటూ కోహ్లీ మాటకు మాట జవాబు ఇచ్చాడు. మీరు మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సిందని కోహ్లీని జర్నలిస్టు అన్నాడు.

దీంతో కోహ్లీ స్పందిస్తూ అక్కడేం జరిగిందో పూర్తిగా తెలుసుకొని ప్రశ్న అడగాలని.. కొద్ది సమాచారంతో ఇక్కడకు వచ్చి మాట్లాడకూడదని కోపడ్డాడు. ఒకవేళ వివాదాలు సృష్టించాలనుకున్నా, ఇది సరైన వేదిక కాదని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాను ఇప్పటికే రిఫరీతో మాట్లాడనని. అక్కడేం జరిగిందనే దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -