Friday, April 19, 2024
- Advertisement -

IPL లో విరాట్ జట్టు ఇంత చెత్త రికార్డ్స్ కొట్టిందా..?

- Advertisement -

ఐపీఎల్ చరిత్రలో అదృష్టం అంతగా కలిసి రాని టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ వరకు వచ్చింది. కానీ ట్రోఫీ గెలవలేకపోయింది.. ఎబి డెవిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ఇలా ఎంతో మంది ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడారు. ఈ జట్టు కి ఎన్నో గొప్ప రికార్డులు సొంతమయ్యాయి. కానీ వాటితో పాటు కొన్ని అనవసరమైన రికార్డులు కూడా ఆర్సిబి సొంతం చేసుకుంది. అవేంటంటే.

రాజస్థాన్ రాయల్స్ జట్టు డెబ్భై రన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ని ఓడించింది. యూఏఈ లో అతి తక్కువ ఐపీఎల్ టోటల్ రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది.

2009లో డెక్కన్ ఛార్జర్స్ తో ఆడినప్పుడు 67 బాల్స్ తో మనీష్ పాండే తీసిన సెంచరీ స్లో సెంచరీ గా రికార్డ్ పొందింది.

ఎక్కువ పరాజయాలు చూసిన జట్టు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉంది. ఎక్కువ విజయాలు సాధించిన జట్టు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో, అలాగే ఎక్కువ టైటిల్స్ సాధించిన జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉంది.

ఐపీఎల్ లో వేగంగా 50 పరుగులు చేసిన రికార్డు కె.ఎల్.రాహుల్ పేరు మీద ఉంది. కానీ ఫాస్టెస్ట్ 50 బై ఎ ఫారిన్ ప్లేయర్ రికార్డ్ మాత్రం సునీల్ నరైన్ పేరు మీద ఉంది. ఒక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కోసం ఇన్నింగ్స్ ఓపెన్ చేసినప్పుడు సునీల్ నరైన్ బెంగళూరు పై 16 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టారు. #5 కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన ఒక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 49 పరుగులలో అన్ని వికెట్స్ పోగొట్టుకుని ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్ తో రికార్డ్ పొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -