కొంతకాలంగా భారత జట్టులో కీలకంగా మారిన ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా రాణిస్తున్నారు. ఐపీఎల్ లో ముంబయ్ తరుపున హార్ధిక్ తన ఆల్రౌండర్ ప్రతిభను కనబర్చి అందర్ని ఆకట్టుకున్నాడు. ఒక వైపు బ్యాట్తోను మరో వైపు బంతితోనూ రాణించాడు. ముంబై ఇండియన్స్కు కప్ గెలవడంతో హార్దిక్ ప్రధాన పాత్ర పోషించాడు.త్వరలో ప్రపంచకప్ మొదలవనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రతిభపై సెహ్వాగ్ స్పందించాడు.
కొంతకాలంగా భారత జట్టులో కీలకంగా మారిన ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా మాత్రం వీరూకి కరెక్ట్ ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందాడు. హర్దిక్ పాండ్యా తోపు అంటూ పొడగ్తల్లో ముంచెత్తాడు. బ్యాటింగ్, బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ప్రతిభకు దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఒకవేళ బీసీసీఐ ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్లలో హార్దిక్తో ఎవరైనా సమానంగా ఉండి ఉంటే.. అతను తిరిగి జట్టుకు ఎంపికయ్యేవాడే కాదు’ అని సెహ్వాగ్ అన్నారు. ఈ ఐపీఎల్లో 15 ఇన్నింగ్స్లో 402 పరుగులు చేసిన హర్దిక్ పాండ్యా స్టైక్ రేటు 91.42. బ్యాట్తోనే కాకుండా బౌలింగ్లోనూ 14 వికెట్లు తీసిన పాండ్యా… ముంబైలో కీ ప్లేయర్గా మారాడు.