Friday, April 19, 2024
- Advertisement -

మూడు వన్డేలు ఓడిపోవడానికి కారణం చెప్పిన కోహ్లీ..!

- Advertisement -

న్యూజిలాండ్, టీమిండియా వన్డే సిరీస్ మిగిసింది. ఈ సిరీస్ లో టీమిండిమా ఓటమిని చూసింది. అయితే ఈ సిరీస్లో న్యూజాలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మూడు వన్డేల్లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని.. మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని అన్నాడు.

కొన్ని సందర్భాల్లో తమ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించినా.. విజేతగా నిలిచేందుకు ఆ ప్రదర్శనలు సరిపోలేదని పేర్కొన్నాడు. టి20 సిరీస్ ను ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు తీవ్రమైన గెలుపు కాంక్షతో బరిలో దిగారని, ఈ విషయంలోనే తాము వెనుకబడిపోయామని కోహ్లీ అంగీకరించాడు.

ఇక తమ దృష్టంతా రాబోయే టెస్టు సిరీస్ పైనే ఉందని, టెస్టుల్లో తమది సమతూకంతో ఉన్న జట్టు అని అభివర్ణించాడు. అయితే, మైదానంలో దిగినప్పుడు సరైన దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. కాగా, టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 21న ఆరంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -