Saturday, April 20, 2024
- Advertisement -

ఈనెల 21న భారత జట్టు ఎంపిక… ధోని భ‌వితవ్యంపై ఉత్కంఠ‌…?

- Advertisement -

త్వ‌ర‌లో టీమిండియా విండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెల్ల‌నుంది. ప్ర‌పంచ‌క‌ప్ వైఫ‌ల్యంతో జ‌ట్టులో భారీమార్పుల‌కు బీసీసీఐ శ్రాకారం చుట్టిన సంగ‌తి తెలిసిదే. పేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన దినేష్ కార్తిక్‌, జాద‌వ్‌, ధోనిపై వేటు ప‌డునుంది. ఈనెల 21న విండీస్ టూర్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌నున్నారు. అయితే జ‌ట్టులో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. వ‌చ్చే ఆదివారం ముంబైలో జరిగే సమావేశం అనంతరం సెలక్టర్లు జ‌ట్ల‌ను ప్రకటించనున్నారు.

ముఖ్యంగా మాజీ సారథి ధోనీ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది. జట్టు భవిష్యత్తును, వచ్చే ఏడాది జరిగే టీ20ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లకు అవ‌కాశాలు ఇవ్వ‌నున్నారు. ఇద‌లా ఉంటె కోహ్లీకి విశ్రాంతినిచ్చి కెప్టెన్సీ ప‌గ్గాల‌ను రోహిత్ అప్ప‌గిస్తార‌నె చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే రోహిత్ కు వ‌న్డే, టీ20 కెప్టెన్‌గా, కోహ్లీని టెస్ట్ కెప్టెన్‌గా ప‌గ్గాలు ఇవ్వాల‌ని సీనియ‌ర్ ఆటగాళ్లు సూచించిన సంగ‌తి తెలిసిందే. వచ్చే నెల 3 నుంచి సెప్టెంబర్ 3 మధ్య ఆతిథ్య విండీస్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -