Thursday, March 28, 2024
- Advertisement -

టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన రాహుల్ ద్ర‌విడ్..

- Advertisement -

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్ నేప‌ధ్యంలో టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాజీ క్రికెట‌ర్ రాహుల్ ద్రావిడ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌న్నారు. స్వ‌దేశంలో ఆసిస్‌తో జ‌రిగిన సిరీస్‌ల‌లో భార‌త్ పేవ‌లంగా ఆడి వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను కోల్పోవ‌డంతో జ‌ట్టుపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ ద్రావిడ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ టీమిండియాకు ఓ వార్నింగ్ లాంటిదన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీంఇండియా… ఆధిక్యంలో ఉండి కూడా… 2-3తో సిరీస్‌ ఓడిపోవడం ప్రమాదకరమన్నాడు. రెండేళ్లుగా టీంఇండియాపై పెట్టుకున్న ఆశలపై ఈ సిరీస్ నీళ్లు చల్లిందన్నాడు.

మెగా టోర్నీని క్రమశిక్షణతో, చాలా శ్రద్ధగా ఆడాలని ఈ పరాజయం గుర్తు చేస్తుంది. ఆసీస్ సిరీస్ చూశాకా నాకు ఆశ్చర్యమేమి కలుగలేదు. ఇప్పటికీ మనమే ఫేవరెట్ అయినా….ఇంగ్లండ్‌లో పరిస్థితులు అంత సులభంగా ఉండవ‌ని మ్యాచ్‌లు చాలా కఠినంగా సాగుతాయ‌న్నారు. టీమ్‌ఇండియా సమతూకంతో కనిపిస్తున్నా.. అక్కడ ఎదురయ్యే ప్రతి సవాలును అధిగమించాల్సిందే అని ద్రవిడ్ సూచించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -