మే 30 నుంచి ఇంగ్లండు వేదికగా ప్రపంచ కప్ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. సమరానికి అన్ని దేశాలు సిద్దమయ్యాయి. టీమిండియా కూడా ఫెవరేట్గా బరిలోకి దిగుతోంది. దీనిలో భాగంగా ఈనెల 22న టీమిండియా ఇంగ్లండ్ బయలు దురనుంది. 5న ఇండియా తన మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని భారత్ మే22న ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఆటగాళ్ల ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా 15 మందితో కూడిన జాబితాను బీసీసీఐ సెలక్సన్ కమిటీ ప్రకటించింది.చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేదర్ జాదవ్ గాయానికి గురైయ్యాడు. మే24నుంచి జరగనున్న వార్మప్ మ్యాచ్లకు ఆడాలంటే కేదర్ జాదవ్ అంతకుముందే ఫిట్నెస్ నిరూపించుకోవాలి. లేకుంటే స్టాండ్ బై గా ఉన్న అంబటి రాయుడికి ఆడే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలతో పాటు థర్డ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ టాపార్డర్ బ్యాట్స్మెన్. ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్ను ఆదుకోగల నైపుణ్యం కలవారు. ఇక బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి ఫేసర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఉంటే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా బలం చేకూర్చనున్నారు.