తాజాగా ఐసీసీ ప్రకటించిన టీమ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు. ప్రపంచకప్ ముగియడంతో 12 మంది ఆటగాళ్లతో కూడిన టోర్నీ ఉత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ సారి జట్టులో కోహ్లీ స్థానం కోల్పోగా ఇద్దరికి చోటు దక్కింది. వారిలో హిట్ మ్యాన్ రోహిత్, బూమ్రాలకు స్థానం దక్కింది. అత్యధిక శాతం ఇగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది.
ఐసీసీ ప్రకటించిన జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్ తరఫున ఒక్కరు ఎంపికయ్యారు. భారత్ నుంచి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాకుల మాత్రమే చోటుదక్కింది. ఈ మెగా జట్టు కెప్టెన్గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ను ఎంపిక చేయగా.. వికెట్ కీపర్గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్ టోర్నీ ప్రదర్శన ఆధారంగానే ఈ జట్టును ఎంపిక చేయడంతో భారత కెప్టెన్కు చోటు దక్కలేదు.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ
విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, జాసన్ రాయ్ (ఓపెనర్స్), జోరూట్, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఫెర్గ్సన్, జస్ప్రిత్ బుమ్రా