Saturday, April 20, 2024
- Advertisement -

వైఎస్ జగన్ కు ఆ బ్రాండ్ కు మధ్య లింక్ ఏంటి..?

- Advertisement -

వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ తెలుపురంగు చొక్కా, ఫార్మల్ ప్యాంటుతో పాటు స్పోర్ట్ షూలు వేసుకుని నడిచారు.

అయితే సీఎం అయ్యాక కూడా జగన్ తెల్లచొక్కాలనే ధరిస్తున్నారు. జగన్ ఆహార్య హుందాతనాన్ని మరింత పెంచేలా ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా మెరిసిపోతూ ఈ చొక్కాలు కనిపిస్తున్నాయి. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ షర్ట్ ల కోసం గూగుల్ లో వెతుకుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ వాడుతున్న షర్ట్ లు యూఎస్ పోలో రాల్ఫ్ లారెన్ అనే కంపెనీకి చెందినవి. గత పదేళ్ల నుంచీ జగన్ యూఎస్ పోలో బ్రాండ్ నే ఇష్టపడేవారు. ఇప్పుడు జగన్ వాడుతున్న ఈ చొక్కాలు ప్రారంభ ధర రూ.9వేల నుంచి ఉన్నాయి. అలాగే రూ. 9వేల నుంచి రూ.15వేల వరకూ ఈ షర్టుల ధర ఉంటుదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -