- Advertisement -

ఉగ్రవాద చర్యలను సహించరాదు!

- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యుడు హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముష్కర మూకల పిరికిపంద చర్యగా పేర్కొంటూ, దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాదని ఆయన చెప్పారు.

పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా, దేశవ్యాప్తంగా అందరు ఐక్యంగా పోరాడాలని హఫీజ్ ఖాన్ అన్నారు.

ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.

క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని హఫీజ్ ఖాన్ ఆకాంక్షించారు . ఈ దారుణ దాడికి తగిన శిక్షలు కల్పించేందుకు సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -