బిగ్బాస్ నాల్గో సీజన్లోవైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్లో ఎక్కువకాలం ఉండలేకపోయారు. కుమార్ సాయి, స్వాతీ దీక్షిత్ వచ్చారు వెళ్లారు. కానీ మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన ముక్కు అవినాష్ ప్రస్తుతం అందరికీ తగ్గ పోటీ ఇస్తూ కంటిన్యూ అవుతున్నారు. ఇంటిసభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి కామెడీ, పంచులతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. ఒకప్పుడు కమెడియన్గా వెలుగొందిన అవినాష్ లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అందరినీ షాక్కు గురి చేసింది.
వచ్చిన కొత్తలో లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. అమ్మ రాజశేఖర్తో పాటు, నాగార్జున కూడా అలాంటి మాటలు వద్దని, బతికి సాధించాలని ధైర్యం చెప్పారు. నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్లో నాగార్జున నామినేషన్లో ఉన్న ఒక్కొక్కొరిని సేఫ్ చేస్తూ వచ్చారు. చివరికి అవినాష్, మాస్టర్ మిగిలారు. ఆ సమయంలో అవినాష్ కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. శరీరం వణకడం ప్రారంభించింది. తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ను వదిలేసి వచ్చాడు, మళ్లీ వస్తే తీసుకోనన్నారు.
కాబట్టి ఆ దారి మూసుకుపోయింది. తన జీవితం మళ్లీ జీరో.. నెత్తిమీద బండెడు అప్పులు.. అవన్నీ ఎలా కట్టాలి అన్న బాధ అవినాష్ ని వెంటాడుతుంది. అయితే బిగ్బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది అని అన్నాడు. ఇదిలా ఉంటే అవినాష్ మనసులోని బాధను అరియానా ముందే పసిగట్టడం విశేషం. పొరపాటున ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లాక ఏం చేసుకోవద్దు అని పదే పదే వేడుకుంది. కాళ్లు పట్టుకుంటా, నా గురించి ఆలోచించు, ఎలాంటి పిచ్చి పని చేయకు అంటూ కన్నీళ్లతో వేడుకుంటూ ఒట్టేయించుకుంది. అంటే అవినాష్ నిజంగా మానసికంగా అంతగా బాధపడుతున్నాడా అని అందరూ ఆవేదన చెందారు. అందరినీ నవ్వించే అవినాష్ బాధలతో కుమిలిపోవడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జబర్దస్త్ ఒక్కటే జీవితం కాదని, బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!
షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?