- Advertisement -
బాలీవుడ్ నటీ సుజాతా కుమార్ ఆదివారం రాత్రి మరణించారు.సుజాతా గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆమె పలు సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో ఆయనకు బామ్మ పాత్రలో నటించారు.
‘హోటల్ కింగ్డమ్’, ‘బాంబే టాకింగ్’, ‘24’ అనే టీవీ సీరియల్స్ లోనూ ఆమె నటించారు. అన్న విషయాన్ని ఆమె సోదరి, నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘నా సోదరి సుజాత కుమార్ ఇకలేరు. ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు’ అని పేర్కొన్నారు.