- Advertisement -
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి కల్కి 2898AD.ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలకపాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో జూన్ 27, 2024న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సినిమాపై ఎలక్షన్స్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది.
మన సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్ కి వెళ్లిపోయారు…ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అడగ్గా.. ఎవరు గెలిస్తే నాకెందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావలి కానీ అంటూ సమాధానమిచ్చినట్టు పోస్ట్ చేసింది స్వప్న.