- Advertisement -
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగా తర్వాత బాహుబలి 2, ఆర్ఆర్ఆర్తో సత్తాచాటారు. ఇక ఆర్ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్రి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.
ఈ నేపథ్యంలో రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ని రిలీజ్ చేయగా జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి ఇలా అంతా జక్కన్నపై ప్రశంసలు గుప్పించారు. ఇక చివరలో రాజమౌళి కేవలం నా కథకు మాత్రమే బానిసగా ఉంటాను అని చెప్పడం హైలైట్గా నిలిచింది. ఆగస్టు 2 నుండి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.