Friday, April 19, 2024
- Advertisement -

హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ !

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో క‌రోనా కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. సామాన్యుల మొద‌లు ప్రముఖుల వ‌ర‌కు ఎవ‌రినీ క‌రోనా మహ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా బారిన‌ప‌డుతున్న సినీ ప్ర‌ముఖులు పెరుగుతూనే ఉన్నారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

ప‌వ‌ర్ స్టార్ స‌డెన్‌గా హోం క్వారంటైన్‌లోకి వెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం క‌రోనా వైర‌స్‌. ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తి గ‌త సిబ్బందిలో ప‌లువురికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ క్ర‌మంలోనే ప‌వన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లడానికి నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అటు రాజ‌కీయ ఇటు సినిమాల‌కు సంబంధించిన ఆయ‌న షెడ్యూల్ వివ‌రాల‌ను సంబంధిత అంశాల‌ను వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలోనే ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇక త్వ‌ర‌లోనే తిరుప‌తి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై సందిగ్ధం నెల‌కొన్న‌ది. కాగా, ప‌వ‌ర్ స్టార్ న‌టించిన వ‌కీల్ సాబ్ మూవీ శుక్ర‌వారం విడుద‌లైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల హంగామా మాములుగా లేదు.

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సంగతి తెలుసా?

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

క‌రోనాతో క‌న్నుమూసిన న‌టుడు సతీష్ కౌల్

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -