Saturday, April 20, 2024
- Advertisement -

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు

- Advertisement -

టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్న వేళ, ఎక్సైజ్ శాఖ నుంచి విచారణను ఎదుర్కోనున్న వారి పేర్లు వెల్లడయ్యాయి. టాలీవుడ్‌ని డ్రగ్స్‌ కలకలం ఓ ఊపు ఊపేస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మీడియా ముందుకొచ్చి, డ్రగ్స్‌ విషయమై స్పందించారు. కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందంటూ వాపోయారు. ఇన్నాల్లు సీక్రెట్‌గా ఉన్నా ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇండస్ట్రీలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాఇ.
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ చిత్రాలు చేసి, ప్రస్తుతం సినిమాలు లేఖ ఖాళీగా ఉన్న హీరో… తరుణ్.
అదేలా హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు చిత్రాలు లేక ఖాళీగా ఉన్న యువ హీరో… నవదీప్.
ముంబైలో ఉండి ఐటమ్ సాంగ్స్ కోసం హైదరాబాద్ వచ్చి పోయే హాట్ బాంబ్… ముమైత్ ఖాన్.
ఓ ప్రముఖ యువగాయని భర్త… గీతామాధురి భర్త నందు పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
వీరితోపాటు సినిమాలు త్వరగా పూర్తి చేస్తారని పేరున్న సంచలన డైరెక్టర్… పూరీ జగన్నాథ్.
హిట్ చిత్రాల్లో నటిస్తూ, ప్రొడక్షన్ పనులను కూడా పర్యవేక్షిస్తూ, నిర్మాతలకు సహకరించే హీరోయిన్… చార్మి.
వీరందరి పేర్లూ డ్రగ్స్ దందాలో నేడు బయటకు వచ్చాయి.
నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ర‌వితేజ‌, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు తదితరులు ఉన్నారు. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి వుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరు కావాలని, రాకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -