- Advertisement -
టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత ఆరోగ్య కారణల వల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటుండటంతో సినిమాలకు విరామం ఇచ్చింది.
అయితే ఏప్రిల్ 28న తన బర్త్ డే ను గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తు ఓ మెస్సేజ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారడమే కాదు వైరల్గా మారింది.
మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి అనే కోట్ను షేర్ చేయగా ఇది చైతూ గురించేనని కామెంట్ వినిపిస్తోంది. కొద్దిరోజులుగా శోభితా దూళిపాళ్ల, చైతన్య పెళ్లి వార్తలపై పుకార్లు షికార్ చేస్తుండగా సమంత దీనిపైనే పరోక్షంగా స్పందించిందని తెలుస్తోంది.