Thursday, March 28, 2024
- Advertisement -

ప్రియాంకరెడ్డికి మద్యం తాగించి.. అఘాయిత్యం పాల్పడిన కామాంధులు

- Advertisement -

శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై అఘాయిత్యం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకపై అత్యారానికి పాల్పడి తర్వాత చంపేసిన తర్వాత కూడా ఆ కామాంధులు మృతదేహం పైనా అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దాంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ పాటు పోలీసులు దిగ్బ్రాంతి చెందారు.

ప్రియాంకపై 30-45 నిమిషాల పాటు అత్యాచారం చేసి చంపేసిన కామాంధులు.. ఆమె మృతదేహాన్ని లారీలో ఎక్కించారు. ఆ టైంలో మృతదేహానికి ప్యాంటు లేదు. లారీ ప్రయాణిస్తున్న టైంలో ప్రియాంక మృతదేహంపై ఆ కామాంధులు అనేకసార్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ప్యాంటు తొడిగినట్లు పోలీసులు విచారణలో తెలింది.

అయితే ఘటనాస్థలంలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అందరు 20ఏళ్లకు పైబడిన వారేనని పోలీసులు స్పష్టం చేశారు. ప్రియాంకరెడ్డికి బలంతంగా మద్యం తాగించి కిరాతకానికి దుండగులు పాల్పడ్డారు. బాధితురాలు తన స్కూటీ కోసం ఎదురు చూస్తున్న టైంలో మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా ఎవరు లేని ప్రదేశంకు లాక్కెళ్లారు.

ఆ టైంలో బాధితురాలు ‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అని అరిచినా వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఎవరికీ అది వినిపించలేదు. తర్వాత ఆమె నోరు నొక్కి లాక్కెళ్లారు. కొద్దిసేపటికి స్కూటీ తీసుకొచ్చిన శివ వారితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు ఎక్కువ అవ్వడంతో బలవంతంగా తాగించి ఆ మత్తులో ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. కాసేపటికి బాధితురాలు అపస్మారిక స్థితికి చేరుకోవడంతో నోరు, ముక్కు మూసేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -