- Advertisement -
నైజీరియా కాట్సినా రాష్ట్రంలోని ఓ పాఠశాలకు చెందిన 400 మంది చిన్నారులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఆయుధాలు ధరించిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలపై దాడికి పాల్పడినట్లు ఆ దేశ పత్రిక వాన్గార్డ్ వెల్లడించింది. పాఠశాల గార్డ్స్పై కాల్పులు జరిపారని పేర్కొంది.
కంకర గవర్న్మెంట్ సైన్స్ సెకండరీ స్కూల్లో శుక్రవారం ఈ దాడి జరిగింది. ఆ రోజు 800 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. అయితే ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది పారిపోయి బయటపడ్డారనే విషయంపై పూర్తి స్పష్టత లేదు.
ఈ ఘటన నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసేయాలని కాట్సినా గవర్నర్ ఆదేశించారు. గుర్తించిన విద్యార్థులను తిరిగి సొంత ఇళ్లకు పంపించారు.ఈ దాడిని నైజీరియన్ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఖండించారు. నిందితులను గుర్తించి, దర్యాప్తు ముమ్మరం చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారు.