మిర్యాల గూడ పరువు హత్య మరవక ముందే హైదరాబాద్ నడిఒడ్డున అలాంటి తరహా సంఘటనే చోటు చేసకుంది. కొత్తగా ప్రేమ పెల్లిచేసుకన్న జంటపై కత్తితో దారుణమైన దాడి జరిగింది. ఇది కూడా పరవు హత్యాయత్నం కావడంతో నగరంలో సంచలనంగా మారింది.
వివ రాల్లోకి వెల్తే ..బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్నతండ్రి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు.
కత్తితో పొడిచి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. పక్కనే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి… రక్తపు మడుగులో ఉన్న ప్రేమికులను సమీపంలో ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమాచారం.
మాధవి, సందీప్లు స్కూటీపై వెళుతుండగా.. యువతి తండ్రి బైక్పై వచ్చి తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. స్థానికుల అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా బెదిరించాడు. స్కూటీపై వెళుతున్న నవజంటపై ఎర్రగడ్డ ప్రాంతంలోని నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అయితే దాడికి పాల్పడింది మాధవి మేనమామ లేదా ఆమె తండ్రా అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
మేనమామతో మాధవికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మాధవి పారిపోయి పెళ్లిచేసుకుంది. ఈ నేపథ్యంలో దాడి జరగడం సంచలనం రేపింది.