Friday, April 19, 2024
- Advertisement -

నెల్లూరు లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా కష్టాలు పడుతుంటే.. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నెల్లూరు రూరల్ మండలం గోల్లకందుకురు సమీపంలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులో బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటి పెంచాలయ్య(60), తాంధ్రా వెంకతరమనమ్మ(19)గా గుర్తించారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘటనాస్థలికి పరిశీలించారు. కాగా, ఈ కూలీలు అంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఐదుగురు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -