Thursday, April 25, 2024
- Advertisement -

భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య ఆమ్లేట్ గొడ‌వ‌..చివ‌ర‌కు ఏంజ‌రిగిందంటే…?

- Advertisement -

భార్య, భర్తల మధ్య ఆమ్లెట్ చిచ్చు పెట్టింది. అడిగినా ఆమ్లెట్ వేయలేదన్న మనస్తాపంతో భ‌ర్త ఆత్య‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెం.1లోని ఎంఐజీకి చెందిన రేవడ మహేష్(24), వనజ దంపతులు. వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మహేశ్ మంగళవారం రాత్రి ఫుల్లుగా మందుకొట్టి ఇంటికొచ్చాడు.

తాగిన మత్తులో ఉన్న మహేశ్ తనకు కోడిగుడ్డు అట్టు వేసి ఇవ్వాలని భార్యను కోరాడు. అందుకామె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. భర్తపై అలిగిన భార్య వెంటనే పక్కింట్లోకి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన మహేష్.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత వనజ.. ఇంటికి వచ్చి చూడగా.. మహేష్ ఉరివేసుకొని కనిపించాడు.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా లోపల మహేశ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతడిని కిందికి దించి చూశారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -