Friday, April 19, 2024
- Advertisement -

విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన మదనపల్లి కూతుళ్ల హత్య కేసు నింధితులు!

- Advertisement -

ఏపీలో సంచలనంరేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పురుషోత్తంనాయుడు, పద్మజలను పిచ్చిగా ప్రవర్తించిన దంపతులు కోలుకున్నారని ఈ నేపథ్యంలోనే వారికి మానసిక వైద్య శాల నుంచి డిశ్చార్జ్ చేసేందుకు సిద్దమయ్యారు. కన్న కూతుళ్ల హత్య కేసులో ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే  జంట హత్యల కేసులో నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజల సోమవారం(మార్చి 29,2021) విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పురుషోత్తమ నాయుడు, దంపతులను జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు.  

ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. 

ఈ నేపథ్యంలో వారిని విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. విశాఖ మానసిక హాస్పిటల్ డాక్టర్లు ఇరువురికీ మెరుగైన వైద్యం అందించారు. దీంతో దంపతులు కోలుకున్నారు. కూతుళ్ల హత్యలపై వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

నగరి ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స..!

అలాంటి వారిని దూరం పెట్టండి.. సురేఖ వాణి షాకింగ్‌ పోస్ట్‌


బోటు ఆపండి బాబో.. పరిగెత్తిన కీర్తి సురేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -