ఈ మద్య లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్డు పైకి వాహనాల తాకిడి తక్కువ అయ్యింది. కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నారు. రోడ్లపై వాహనాల తాకిడి మళ్లీ పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
తాజాగా గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది.ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. కారును అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించినట్టు పోలీసులు తెలిపారు.
ప్రమాదం కారణంగా రహదారి రక్తసిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తారాపూర్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
190 దేశాలు, 17 భాషల్లో ధనుష్ మూవీ..!