Tuesday, April 23, 2024
- Advertisement -

తెల్లారితో పెళ్లనగా బావ మరిదిని నరికి చంపిన బావ

- Advertisement -

తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి , ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా అంబారిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వీర్ల శంకర్ (48) చెల్లెలు జమునను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ కు ఇచ్చి వివాహం చేశారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవళిక, పూజిత. వెంకటేశ్ తన కుంటుంబాన్ని కొంతకాలంగా పట్టించుకోవడం లేదు. మరో వివాహం చేసుకొని అదే గ్రామంలో మరో ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. వెంకటేశ్ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరుపై ఉంది. అందులో కొంత వీర్ల శంకర్ ఇటీవల విక్రయించాడు. ఆడబ్బుతో వెంకటేశ్ పెద్ద కుమార్తె వివాహం జరిపించాలని నిర్ణయించారు.

దీంతో తన భూమిని విక్రయించాడన్న కోపంతో బావమరిది శంకర్ పై వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. నేడు (ఫిబ్రవరి 3) న వివాహం జరగాల్సి ఉంది. కాగా పెళ్లి పందిరి వేస్తున్న శంకర్ ను అదే పందిట్లో వెంకటేశ్ గొడ్డలితో విచక్షణా రహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన శంకర్ చికిత్స పొందుతూ చనిపోయాడు.

కిరాయి మ‌నుషులతో భ‌ర్త‌ను..కిరాతంగా..

ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు

పుష్ప సినిమాతో ప్రేరణ పొంది.. యువకుడిని చంపేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -