Friday, March 29, 2024
- Advertisement -

కోడలిపై కన్నేసిన మామ.. తండ్రిని కడతేర్చిన కొడుకు

- Advertisement -

ఈ మద్య ఆడవారిపై కామాంధుల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు దుర్మార్గులు. కోడల్ని కన్న కూతురిలా చూడాల్సిన మామ ఆమెపై కన్నేశాడు.. ఎలాగైనా అనుభవించాలని చూశాడు.. కానీ పాపం పండి కన్న కొడుకు చేతిలోనే హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు మండలంలోని దంతెరపల్లె గ్రామానికి చెందిన రంగప్రసాద్ భార్య, తండ్రి భాస్కర్‌తో కలిసి ఉంటున్నాడు. గత కొంత కాలంగా భాస్కర్ తన కోడలిపై కన్నేశాడు.. కొడుకు లేని సమయంలో తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు.

కొన్నాళ్లు ఓపిక పట్టిన ఆమె సహనం కోల్పోయి ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని రంగప్రసాద్‌ తన తండ్రిని హెచ్చరించాడు. కానీ ఆ కామాంధుడు తన వక్ర బుద్ది మాత్రం మార్చుకోలేదు. అతడిలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన రంగప్రసాద్ రాత్రి నిద్రపోతున్న సమయంలో తండ్రి గొడ్డలితో నరికి చంపేశాడు. తన తండ్రి కరోనాతో మరణించాడని గ్రామస్తులను నమ్మించాడు. గ్రామంలో పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూడదంటూ సమీప బంధువుల సహకారంతో రాత్రికి రాత్రే దహనం చేసే ప్రయత్నం చేశాడు.

అసలు విషయం తెలుసుకొని వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దహనం అవుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టులో భాస్కర్‌ది హత్యని తేలడంతో పోలీసులు రంగప్రసాద్‌ను విచారించారు. తన భార్యపై లైంగిక దాడికి దిగిన తన తండ్రిని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు రంగ ప్రసాద్. కాగా, మృతదేహాన్ని దహనం చేసేందుకు సహకరించిన వెంకటాపురం గ్రామానికి చెందిన మోడి రంగనాథం, రంగస్వామి, ఆదిగంగయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

‘మా’ఎన్నికల బ‌రిలో నటి హేమ..

పెళ్లి చేసుకున్న రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలిసి భర్త షాక్!

విశ్వాసం లో కూతురు సెంటిమెంట్.. వలిమై లో మదర్ సెంటిమెంట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -