Thursday, April 25, 2024
- Advertisement -

దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం!

- Advertisement -

దేశంలో రోజు రోజుకీ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్ల నుంచి వృద్దుల వరకు మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఆ మద్య వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపాడు ఓ కామాంధుడు. ఇలా చిన్న పిల్లలపై అత్యాచారాలే కాదు హత్యలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహ్​డ్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

చాక్లెట్ కొనుక్కోనేందుకు ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉండే ఓ ఆటో డ్రైవర్ కి ఆ చిన్నారిపై కన్ను పడింది. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లికి జరిగిన విషయాన్ని తెలిపింది.

దాంతో తల్లిదండ్రులు స్థానికులతో కలసి దుకాణం వద్దకు వెళ్లి ఆ కామాంధుడిని చితకబాదారు. అనంతరం పోలీసుస్టేషన్​లో నిందితుడిని అప్పగించారు. గణేశ్​పై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బమ్మెర బాలకృష్ణ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -