Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లి చేసుకుంటా అంటూ ఏడాదిగా అత్యాచారం.. చివరికి..

- Advertisement -

దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం అత్యాచాలు మాత్రమే కాదు హత్యల పరంపర కూడా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కొన్ని చోట్ల కామాంధులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. తాజాగా జ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ న‌గ‌రంలోని కేడియా ప్రాంతంలో దారుణం జ‌రిగింది. స్థానికుడైన ఓ యువ‌కుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన యువ‌తిని సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేసుకుని తర్వాత ఆమెకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పపడ్డాడు.

పెండ్లి చేసుకుందామ‌ని న‌మ్మిస్తూ ఏడాదికిపైగా ప‌లు ద‌ఫాల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. తీరా ఆ యువతి పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడగడంతో ముఖం చాటు వేశాడు. దాంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే.. జిడ్డి ల‌డ్కా పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క‌లిగిన 20 ఏండ్ల‌ యువ‌కుడు 2019 జూన్‌లో ఉజ్జ‌యినికి చెందిన 22 ఏండ్ల యువ‌తికి ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్‌ను స‌ద‌రు యువ‌తి యాక్సెప్ట్ చేయ‌డంతో వారు త‌ర‌చుగా చాటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఆ తర్వాత యుతిని ప్రేమిస్తున్నానని.. తన ప్రేమను అంగీకరించాలని బ్రేడ్ తో చేయిపై కోసుకొని ఫోటోలు పంపాడు. దాంతో ఆమె నిజంగా అతని ప్రేమలో నిజాయితీ ఉందని భావించి కాదంటే ఆత్మహత్య చేసుకుంటాడేమో అని భయపడింది. ఇదే అదనుగా ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లిన యువ‌కుడు పెండ్లి చేసుకుందామంటూ మాయ‌మాట‌లు చెప్పి ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మూడు రోజుల‌పాటు హోట‌ల్‌లోనే ఉంచి అఘాయిత్యం చేశాడు. అనంత‌రం 2019 అక్టోబ‌ర్‌లో మ‌రోసారి యువ‌తిని అహ్మ‌దాబాద్‌కు ఆహ్వానించి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. తర్వాత ముఖం చాటు వేశాడు.. దాంతో ఉజ్జ‌యిని పోలీసులకు జ‌రిగిందంటూ వివ‌రిస్తూ ఫిర్యాదు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -