Friday, April 26, 2024
- Advertisement -

దారుణం.. అశ్లీల దృశ్యాలు చూపిస్తూ.. మైనర్ బాలికపై అత్యాచారం!

- Advertisement -

ఎన్ని చట్టాలు వస్తున్నా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లలను కూడా కామాంధులు వదలడం లేదు. తాజాగా శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన కామాందుడు. అత్యాచార దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించి అవి అందరికీ చూపిస్తా అంటూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతే కాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే… చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గోపిగా గుర్తించారు. బెదిరిపోయిన ఆ బాలిక విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది.

కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఈ ఘటన వెలుగుచూసింది. అనంతరం ఫిర్యాదు చేయగా… పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -