భర్త తండ్రితో శారిరక సంబంధం పెట్టుకున్న విషయం తన కూతురు ఎక్కడ బయటపెడుతుందోనని ఓ మహిళ కన్న కూతురునే హతమార్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని బోనకల్లో చోటు చేసుకుంది. వైరా ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు.
బోనకల్కు చెందిన పాలెపు హరికృష్ణ సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరికృష్ణ లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పనిలో భాగంగా తరచుగా దూర ప్రాంతాలకు వెళుతుంటాడు.ఈ క్రమంలో సునీతకు తన భర్త తండ్రి నరిసింహారావుతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతోంది.
సునీత తన మామతో కలిసి ఏకాంతంగా గదిలో ఉండడాన్ని ఆమె పెద్ద కుమార్తె మహాదేవి చూసింది. విషయాన్ని తండ్రితో చెబుతానని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్కడ మహాదేవి బయటపెడుతుందోనని సునీత మూడు రోజుల క్రితం మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి గొంతుకు చున్నీని బిగించి హతమార్చింది. అనంతరతం తన కూతురు ఫిట్స్తో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. బాలిక శరీరంపై గాయలను చూసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.