Thursday, March 28, 2024
- Advertisement -

ఆస్తి కోసం నీచానికి ఒడిగ‌ట్టిన కొడుకు…తండ్రిని ఏంచేశాడంటే..?

- Advertisement -

రోజు రోజుకీ మాన‌వ సంబంధాలు పాతాలానికి దిగ‌జారుతున్నాయి. అక్ర‌మ సంబంధాలు, ఆస్తుల‌కోసం బ‌రితెగించి వ‌ర‌స‌లు మ‌ర‌చి కిరాతకంగా చంపుతున్న సంఘ‌ట‌న‌లు ప్ర‌తీ రోజు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తండ్రి ఆస్తికోసం ఓ కొడుకు ఎవ‌రూ ఒడిగ‌ట్ట‌ని నీచానికి ఒడిగ‌ట్టాడు.

పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ ప‌రిధిలో ఈ దారునం చోటు చేసుకుంది. గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రికి ఓ ‘పుత్రరత్నం’ చుక్కలు చూపించాడు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ పరిధిలోని లేతమామిడి తోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది.. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజనీ ఆస్తి తమ పేరిట రాయమని తండ్రితో గొడవ పడుతున్నాడు.. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల దిగుబడి కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఆస్తి మొత్తం రాసిచ్చేయాలన్న తన డిమాండ్ కు తండ్రి అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పెంపుడు కుక్కను ఆయనపై ఉసిగొల్పాడు. ఈ బాధను తట్టుకోలేని ఆ పెద్దాయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

ఇద్దరు కొడుకుల పేర్లపై చెరో 5 సెంట్ల భూమిని రాసేందుకు లక్ష్మణదాసు ముందుకొచ్చాడు. కాని చిన్న కొడుకు చిరంజీవి ఒప్పు కోలేదు. అయితే నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో లక్ష్మణదాసు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇంట్లో ఉంటే అనరాని మాటలు అనడమే కాకుండా.. తనను మానసికంగా వేధిస్తున్నారని.. కొడుకు, కోడలి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా లక్ష్మణదాసు తహసీల్దార్‌కు గోడు వెళ్లబోసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -