Friday, March 29, 2024
- Advertisement -

ఆదిలాబాద్‌ కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి!

- Advertisement -

ఆదిలాబాద్‌ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ జమీర్‌ మృతిచెందాడు. ఆదిలాబాద్‌ మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఫారూఖ్‌ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జమీర్‌ను.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం ఇక్కడి తాటిగూడలో పాత కక్షలు పురివిప్పాయి. ఇవి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి.

ఇటీవల ఫారూఖ్‌ ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో మొతేషీన్‌ నడుములోకి ఒక తూటా దూసుకుపోగా, సయ్యద్‌ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయితే సయ్యద్‌ జమీర్‌ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జమీర్ ఇవాళ ఉదయం చనిపోయారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -