ఈజిప్ట్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కైరో ప్రాంతంలోని షోహాగ్లో జరిగింది. ఈ ప్రమాదంలో 66 మందికి గాయాలైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
దుర్ఘటన జరిగిన ప్రాంతం ఈజిప్టు రాజధాని కైరోకు 460 కి.మీ. దూరంలో ఉంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దుర్ఘటన జరిగిన ప్రాంతం ఈజిప్టు రాజధాని కైరోకు 460 కి.మీ. దూరంలో ఉంది.
ఘటనా స్థలి భీతావహంగా కనిపిస్తోంది. రైలు బోగీలు చెల్లాచెదురై ఒకదానిపైకి మరొకటి ఎక్కిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. బోగీల్లో మృతదేహాలు ఇరుక్కున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బంద్ విజయవంతం!
డిగ్రీ కళాశాల కి ప్రభుత్వం హెచ్చరికలు జారీ..!
రెండో వన్డేలో సెంచరీ బాదేసిన కేఎల్ రాహూల్.. కోహ్లీ, పంత్ అర్థసెంచరీ!