ఈ మద్య కొంత మంది టెక్నాలజీని అసాంఘిక కార్యాకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని కొంత మంది దుర్మార్గులు తెగబడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా యూపీలోని బలియాకు చెందిన ఓ యువకుడు ఏకంగా 370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడిని బలియా జిల్లా గర్హవార్ పోలస్ స్టేషన్ పరిధిలో స్టేషనరీ షాపు నిర్వహించే శివ్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
మహిళలకు చేసిన వీడియో కాల్స్ను రికార్డు చేసి ఎవరైనా తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే వారిని బ్లాక్మెయిల్కు గురిచేసేవాడు. 15 జిల్లాలకు చెందిన దాదాపు 370 మంది మహిళలను వేధించాడు. ఈ నేరాన్ని చేసేందుకు శివకుమార్ వేర్వేరు సిమ్ కార్డులతో ఏడు సెల్ ఫోన్లను వాడేవాడని దర్యాప్తులో వెల్లడైంది. గత ఏడాది ఫిబ్రవరిలో లక్నో నుంచి నిందితుడిపై తొలి ఫిర్యాదు రాగా అధికారులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మహిళలను వేధిస్తూనే ఉన్నాడు.
ఓ స్టేషనరీ షాపులో పనిచేసే ఆ నింధితుడు పని ముగించుకున్న తర్వాత కొన్ని నెంబర్లను సేకరించి ట్రూకాలర్ ద్వారా వారు మహిళలని నిర్ధారించుకున్న తర్వాత వారికి వాట్సాప్ వీడియో కాల్స్ చేసేవాడు. ఆ మహిళలు కాల్ కట్ చేసేలోపు దాన్ని రికార్డు చేసి పెట్టేవాడు. ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే రికార్డయిన వీడియో క్లిప్ను ఆమె భర్తకు, అత్తమామలకు పంపుతానని బెదిరించేవాడు. నిందితుడు శివకుమార్ను అరెస్ట్ చేసిన పోలీసలు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విహారంలో విషాదం.. పెన్నా నదిలో మునిగి నలుగురు మృతి!