- Advertisement -
ఈ మద్య దేశ వ్యాప్తంగా కరోనా కేసుల ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో.. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రత చర్యలు పాటించాలని ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వేల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో బైక్ ను లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
వారు ప్రయాణిస్తున్న బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. మృతులు ఏఆర్ కానిస్టేబుల్ రమణరాజు, సీతం కళాశాల అధ్యాపకుడు సంజీవ్ కుమార్ లుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.