- Advertisement -
ఈ మద్య మనిషి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల కట్టుకున్న భార్యను భర్త.. భర్తను భార్య చంపుకునే పరిస్థితి నెలకొంది. పెద్దల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంట వివాహేతర సంబంధాలతో దూరమవుతున్నారు.. చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను దారుణంగా చంపి మూటకట్టి పడేశాడు.
కేపీహెచ్బీ కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. పీహెచ్బీ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి వాసన రావడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే తన భార్యను హత్య చేసి మూటకట్టిన్లు నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.